Saturday, May 18, 2024

బావిలో పడిన కారు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

6 dead vehicle fell into well in Madhya Pradesh

 

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌పూర్‌లో బావిలో కారు పడడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నుంచి కారును బయటకు తీశామని మహారాజ్‌పూర్ పోలీస్ అధికారి జడ్‌వై ఖాన్ తెలిపాడు. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News