Thursday, May 2, 2024

ఎపిలో లక్ష దాటిన కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

6051 New Corona Cases Reported in AP

అమరావతి: ఎపిలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో 6,051 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే ఎపిలో 49మంది మరణించారని తెలిపింది.దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య లక్ష 2 వేలకు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,090కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 51,701మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 49,558 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ఎపిలో 43,127మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16 లక్షల 86వేలకు పైగా కరోనా పరీక్షలు చేశామని పేర్కొంది.

6051 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News