Friday, May 3, 2024

ఇండియాలో కొత్తగా 63,489 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

63489 Covid 19 cases and 944 deaths reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రజలను భయపెడుతోంది. గత 24గంటల్లో 63,489 కొత్త కోవిడ్-19 కేసులు, 944 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 25,89,682కు పెరిగింది. ప్రస్తుతం వీటిలో 6,77,444 యాక్టివ్ కేసులుండగా.. 18,62,258 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 49,980మందిని కరోనా కబలించింది. ఇండియాలో ఆగస్టు 15 వరకు 2,93,09,703 నమూనాలను పరీక్షించారు. వీటిలో శనివారం 7,46,608 నమూనాలను పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)ప్రకటించింది.

63489 Covid 19 cases and 944 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News