లక్నో: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లా ఇసానగర్లో చోటుచేసుకుంది. గోళ్లతో బాలిక కనుగుడ్లు పెకలించి, నాలుక కోసి, చున్నీతో ఉరివేసి బాలిక చనిపోయాక చెరకు తోటలో పడేసినట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతేదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
నిందితులపై హత్య, సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సకీయేంద్ర కుమార్, పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ), లఖింపూర్ ఖేరీ తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుందన్నారు. మైనర్ పోస్ట్మార్టం రిపోర్టులో ఇది అత్యాచారం కేసు అని ధృవీకరించారని సకీయేంద్ర కుమార్ చెప్పారు. నిందితులను సంతోష్ యాదవ్, సంజయ్ గౌతమ్ గుర్తించి వారిపై సెక్షన్ 302 (హత్య), సెక్షన్ 376 (డి) (సామూహిక అత్యాచారం) కింద అరెస్టు చేసి జైలుకు పంపామని ఎస్పీ తెలిపారు.
13 year old girl was raped and killed in Uttar Pradesh