Sunday, April 28, 2024

డబుల్ డెక్కర్ బస్సులో మంటలు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Fire in Double Decker Passenger Bus at Firozabad

లక్నో: బీహార్ నుంచి ఫిరోజాబాద్‌లోని గుజరాత్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని గ్రామీణ ఫిరోజాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 72 మంది ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Fire in Double Decker Passenger Bus at Firozabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News