- Advertisement -
సూర్యాపేట: విజయవాడ జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జీ తిరుమలగిరి శివారులో ఓ కారు రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో డ్రైవింగ్ తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా… తీవ్రంగా గాయపడిన అతని భార్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేటలోని దవాఖానలో చికిత్స పొందుతూ బాదితురాలు ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -