Tuesday, April 30, 2024

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు 7 అవార్డులు

- Advertisement -
- Advertisement -

7 awards for Telangana Panchayati Raj Department

 

మూడు కేటగిరీల్లోనూ
జనరల్ కోటాలో తెలంగాణ ధూం ధాం
కేంద్రం ప్రకటించిన అన్ని కేటగిరీల్లోనూ
తెలంగాణ హవా
సిఎం కెసిఆర్ దార్శనికతకు ఈ అవార్డులు నిదర్శనం : మంత్రి ఎర్రబెల్లి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖకు ఏడు జాతీయ అవార్డులు లభించాయి. మూడు కేటగిరీల్లోనూ జనరల్ కోటాలో తెలంగాణ ధూం ధాం చేసింది. కేంద్రం ప్రకటించిన అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ హవా కొనసాగింది. కాగా ఈ వార్డులు సిఎం కెసిఆర్ దార్శనికతకు నిదర్శనమని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రతి ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ గ్రామ పంచాయతీలు ప్రకటించే దీన్ దయాల్ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారాలతో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో ఏడు అవార్డులు దక్కాయి.

ఏడు అవార్డులూ జనరల్ కేటగిరీలోనే రావడం విశేషం. జిల్లా, బ్లాక్, మండలం, గ్రామ పంచాయతీల వారీగా ఈ అవార్డులను ప్రటించారు. కేటగిరీల వారీగాఆ మొదటి కేటగిరీలో నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్‌గా, రెండో కేటగిరీలో గ్రామపంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్ అవార్డు, మూడో కేటగిరీలో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డుల పేరుతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సంజీబ్ పత్ జోషి ఈ అవార్డులను ప్రకటించారు.

ఈ అవార్డుల్లో.. జిల్లా విభాగంలో నిజామాబాద్ జిల్లాకు అవార్డు దక్కింది. బ్లాక్/మండలం విభాగంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా)లోని సుల్తానాబాద్‌కి అవార్డు వచ్చింది. ఇదే కేటగిరీలో నిజామబాద్ జిల్లా నందిపేటకు వచ్చింది. గ్రామ పంచాయతీ విభాగంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా), శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీకి దక్కింది. ఇదే విభాగంలో మెదక్ జిల్లా(ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా) చిన్న కోడూరు మండలం గుర్రాల గొండి గ్రామ పంచాయతీకి దక్కింది. ఇదే విభాగంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా) కాటారం మండలం గంగారం గ్రామ పంచాయతీకి వచ్చింది. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం (ప్రస్తుతం సిద్ధిపేట రూరల్ మండలం)లోని పెద్ద లింగారెడ్డి పల్లె అనే గ్రామ పంచాయతీకి జనరల్ కేటగిరీలో అవార్డు దక్కింది.

మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు

జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని 7 జాతీయ ఉత్తమ అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన మూడు కేటగిరీల్లోనూ అవార్డులు రాగా, అవన్నీ జనరల్ విభాగంలోనే రావడం మన రాష్ట్ర ప్రతిభకు నిదర్శనం అన్నారు. ఈ అవార్డులు సిఎం కెసిఆర్ దార్శనికతకు, ప్రగతికాముకక నిబద్ధతకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు. ఆయా జిల్లా/మండలం/గ్రామ పంచాయతీలు అభివృద్ధి సాధించడానికకి అన్ని విధాలుగా స్ఫూర్తిగా నిలిచిన సిఎం కెసిఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు, ధన్యావాదాలు తెలిపారు.

అలాగే, ఉత్తమ అవార్డులు పొందిన జిల్లా/మండలం/గ్రామ పంచాయతీలకు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుభాకాంక్షలు తెలపారు. ఈ స్ఫూర్తి కొనసాగాలని, వచ్చే ఏడాది మరిన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు ఈ అవార్డులకు పోటీ పడాలని, మరిన్ని అవార్డులు దక్కాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News