Wednesday, May 8, 2024

జీపుకు ట్రక్కు ఢీకొని ఏడుగురి మృతి..

- Advertisement -
- Advertisement -

7 killed in road accident in Maharashtra

లాతూర్(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శనివారం ఉదయం జీపుకు ట్రక్కు ఢీకొని జీపులోని ఏడుగురు మృతి చెందగా.. 10 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. లాతూరు అంబాజోగై జాతీయ రహదారిపై అంబాజోగై పట్టణానికి సమీపాన నందగావ్ పతా వద్ద శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. వీరంతా లాతూరు జిల్లా సాయి, అర్వి గ్రామాలకు చెందిన వారు. అంబాజోగై తహసీల్ లోని రడి ప్రాంతానికి ఒక కార్యక్రమం కోసం వీరు జీపులో వెళ్తుండగా, ట్రక్కు దూసుకువచ్చి జీపును ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు. మృతులు నిర్మల సోమ్ వంశీ (38), స్వాతి బోడ్కె(35), శకుంతల సోమ్‌వంశీ (38), సోజర్‌బాయి కదమ్(37), చిత్రా షిండే (35), ఖండూ రోహిలే (డ్రైవర్ 35)లతోపాటు తొమ్మిదేళ్ల బాలుడును గుర్తించారు. ఈ ఘోర ప్రమాద వార్త తెలియగానే మహారాష్ట్ర సామాజిక న్యాయ మంత్రి ధనంజయ్ ముండే, సీనియర్ పోలీస్ అధికారులు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

7 killed in road accident in Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News