Tuesday, May 21, 2024

పడవ మునిగి 78 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఏథెన్స్ : గ్రీస్‌లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న పడవ సముద్రంలో మునిగి 78 మంది చనిపోయారు. 104 మందిని రక్షించారు. ఇంకా పదుల సంఖ్యలో కొంతమంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్‌కు చెందిన ఆరు పడవలు, నావికాదళం, సైనిక విమానాలు, హెలికాప్టర్లు, ప్రైవేటు పడవలు, డ్రోన్లు రంగంలోకి గాలిస్తున్నాయి. గ్రీస్‌ను దాటి ఇటలీ చేరడానికి స్మగ్లర్లు ఎంచుకున్న మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటలీకి చెందిన పడవ తూర్పు లిబియా లోని తోబ్రక్ నుంచి వలసదారులతో బయలుదేరిన తరువాత భారీ గాలులకు గురై ప్రమాదం పాలైందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News