Monday, April 29, 2024

లిబియాలో ఓడ మునిగి 61 మంది మృతి

- Advertisement -
- Advertisement -

లిబియా తీరంలో పడవ మునిగిపోవడంతో 61 మంది వలసదారులు మృతి చెందారు. మహిళలు, పిల్లలతో వలస వెళ్తుండగా ఓడ మునిగిపోయింది. ఉత్తర ఆఫ్రికాలో విషాదం చోటుచేసుకుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) తెలిపింది. లిబియా వాయువ్య తీరంలోని జువారా నుండి వలసదారులు బయలుదేరిన తర్వాత అధిక అలల కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఓడలో 86 మంది వలసదారులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. అందులో 25 మందిని రక్షించి లిబియా నిర్బంధ కేంద్రానికి తరలించినట్లు ఐఓఎమ్ వెల్లడించింది. ప్రాణాలతో బయటపడిన వారందరూ మంచి స్థితిలో ఉన్నారని, ప్రస్తుతం ఆస్పపత్రిలో వైద్య సహాయం పొందారని తెలిపింది.

ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ ప్రకారం, ట్యునీషియా, లిబియా నుండి ఈ సంవత్సరం 153,000 కంటే ఎక్కువ మంది వలసదారులు ఇటలీకి చేరుకున్నారు. అక్రమ వలసలను అరికడతామని ఇటలీకి చెందిన రైట్‌రైట్ ప్రధాని జార్జియా మెలోని గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించారు. ఉత్తర ఆఫ్రికా నుండి ప్రమాదకరమైన క్రాసింగ్‌కు ప్రయత్నించే వ్యక్తులను రక్షించే స్వచ్ఛంద నౌకల కార్యకలాపాలను పరిమితం చేయడానికి మెలోని హార్డ్-రైట్ ప్రభుత్వం ఇప్పటివరకు అనేక చర్యలు తీసుకుంది. ఇరువురు నేతలు తమ దేశాల తీరంలో వలసదారుల పడవ దిగడాన్ని నిలిపివేస్తామని, ప్రజల స్మగ్లర్లను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఐక్యరాజ్యసమితి సెంట్రల్ మెడిటరేనియన్ వలస మార్గాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా అభివర్ణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News