Sunday, April 28, 2024

రూ.800 కోట్ల అక్రమ రియల్ దందా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదు స్వాధీనం

ఆదాయ పన్ను శాఖకు చిక్కకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చే సుకున్నారు. హైదరాబాద్‌లోని మూ డు రియల్ ఎస్టేట్ సంస్థల్లో నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించా రు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థల్లో రూ. 800 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగి నట్లుగా ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు గు ర్తించారు. నగరంలోని నవ్యా డెవల పర్స్, రాఘమయూరి ఇన్‌ఫ్రా, స్కం ధాన్షీ రియల్ ఎస్టేట్ సంస్థలపై ఆదా యపు పన్ను శాఖ అధికారులు సోదా లు నిర్వహించారు. ఈ మూడు సంస్థ లు సుమారు రూ.800 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్లుగా సమాచా రం. ఈ సంస్థల నుంచి సుమారు రూ. 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసు కున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధి కారులకు చిక్కకుండా ప్రత్యేక సాఫ్ట్‌వే ర్ తయారు చేసుకుని నగదు లావాదే వీలు జరిపినట్లుగా ఐటీ శాఖ అధికా రులు గుర్తించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ని కూ డా రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు ధ్వంసం చేశారు. భూములను కొను గోలు చేసిన సమయంలో నగదును బ్యాంకుల ద్వారా చేయకుండా జాగ్ర త్తలు తీసుకున్నారు. హైదరాబాద్, అ నంతపురం, కర్నూలు, వైజాగ్, కడప, నంద్యాల, బళ్లారిలలో సోదాలు ని ర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News