- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువ అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 8,794 మందికి పరీక్షలు నిర్వహించగా 894 కొత్త కోవిడ్-19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 92,255కి చేరుకున్నాయి. మొత్తం 703 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 70,132 మంది కోలుకోగా… ప్రస్తుతం 21,420 యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 2006 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,53,349 మంది కరోనా బాధితులకు టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా జిహెచ్ఎంసి పరిధిలో 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- Advertisement -