సంగాల్ : హిమాచల్ ప్రదేశ్ లోని సంగాల్ లోయలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది పర్యాటకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఒక పెద్ద బండరాయి తగిలిన తరువాత వంతెన ఒక భాగం కూలిపోయి నదిలో పడిపోతున్నట్లు వీడియోలో చూడోచ్చు. కొండచరియలు పడి వాహనాలు, విశ్రాంతి గదులు ధ్వంసం అయ్యాయి. భారీ ధూళి మేఘాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
9 tourists dead Multiple landslides in Himachal
#WATCH | Himachal Pradesh: Boulders roll downhill due to landslide in Kinnaur district resulting in bridge collapse; vehicles damaged pic.twitter.com/wkFlbBmj6p
— Daily Excelsior (@DailyExcelsior1) July 25, 2021