- Advertisement -
బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ బాధితులకు తగిన వైద్యచికిత్సలు అందించడానికి భారత్ సంఘీభావాన్ని, సహకారాన్ని తెలియ చేస్తూ భారత్ ప్రధాని పంపిన లేఖకు చైనా ప్రశంసించింది. 900 మందిని పొట్టన పెట్టుకున్న వైరస్ నిర్మూలనకు తగిన వైద్య చికిత్సలో సహకారం అందిస్తామని ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జింగ్పింగ్కు లేఖ రాశారు. సత్సంకల్పంతో భారత్ అందిస్తున్న సాయం చైనాతో ఉన్న స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తుందని చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సవాలును అధిగమించడంలో, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేయడంలో కూడా భారత్ నుంచి పూర్తి సహకారాన్ని మోడీ ప్రకటించారు. హుబెయి ప్రావిన్సు నుంచి 650 మంది భారతీయులను తరలింప చేయడంపై మోడీ జింగ్పింగ్కు కృతజ్ఞతలు తెలిపారు.
India’s contribution to China in corona treatment
- Advertisement -