Tuesday, April 30, 2024

మార్చి 4న టిఎస్ పిజిఈసెట్ 2020 నోటిఫికేషన్..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు(టిఎస్ పిజిఇసెట్) నోటిఫికేషన్ మార్చి 4వ తేదీన విడుదలకానుంది. ఎంటెక్, ఎంఇ, ఎం.ఆర్క్, ఎం.ఫామ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులు మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తదీ వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు.కాగా, రూ.500 ఆలస్య రుసుముతో మే 6, రూ.2000 ఆలస్య రుసుముతో మే 13, రూ.5000 ఆలస్య రుసుముతో మే 20, రూ.10,000 ఆలస్య రుసుముతో మే 26 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలు మే 20 నుంచి మే 27 వరకు హాల్ టికెట్టు డౌన్ లోడ్ చేసుకోనున్నారు. ఇక, మే 28 నుంచి మే 31 వరకు నాలుగు రోజులపాటు ప్రవేశ పరీక్ష నిర్వహించి, జూన్ 15వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు.

TS PGECET 2020 Notification to be released on March 4th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News