Tuesday, April 30, 2024

వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఉపయోగించుకోవాలి: వెంకయ్యనాయుడు

- Advertisement -
- Advertisement -

Farmer

 

హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు.  మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సమయానుకూలంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఉపయోగించుకోవాలని సూచించారు. విస్తృతమైన మార్కెట్, గోదాముల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు, కల్తీలేని మందులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

Indian Farmers use new Methods says Venkaiah Naidu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News