Saturday, May 4, 2024

రెండో టెస్టు: టీమిండియా 242 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

India

క్రిస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 242 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్ మెన్స్ ఓపెనర్ పృథ్వీషా (54) పరుగులతో ఓకే అనిపించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(07), కెప్టెన్ విరాట్ కోహ్లి(03)నిరాశపర్చారు. మిడిలార్డర్ లో పూజారా (54), హనుమ విహారి(55) రాణించారు. అటు కివీస్ బౌలర్లలో జేమీసన్ 5 వికెట్లు తీయగా, సాథీ, బౌల్డ్ కు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఫార్మెట్ ఏదైనా విరుచుకుపడే విరాట్ ఈ మధ్య టెస్టుల్లో ఎందుకు విఫలమవుతున్నాడని క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల కోహ్లి ఆడిన 5 ఇన్నింగ్స్ (3,19,2,9,15)ల్లో ఫెయిలయ్యాడు. దీంతో విరాట్ కి ఏమైంది? అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మొదటి మ్యాచ్‌లో ఓడిన భారత్ శనివారం ప్రారంభమయైన రెండో చివరి టెస్టులో విజయమే లక్షంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అటు ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని తహతహలాడుతోంది.

New Zealand vs India 2nd Test Day 1 match

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News