- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడేవని… ఇప్పుడు నిరంతరం కరెంట్ సరఫరా వల్ల మూడు షిప్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని గొంగిడి సునీత కొనియాడారు. అసెంబ్లీలో నాలుగు బిల్లులకు శాసన సభ ఆమోదంతో పాటు 11 శాఖల పద్దులను మంత్రులు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పద్దులపై చర్చ సందర్భంగా గొంగిడి శాసన సభలో మాట్లాడారు. కార్మికులు సంక్షేమ కోసం బోర్డు ఏర్పాటు చేశామని, అసంఘటిత కార్మికులు చనిపోతే ఆరు లక్షల రూపాయలు ఇస్తున్న గొప్ప మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అని, అసంఘటిత రంగ కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అనేక కొత్త పరిశ్రమలు రావడం వల్ల వేలాది మందికి ఉపాధి లభించిందని గొంగిడి ప్రశంసించారు. ఆర్టిసి ఉద్యోగులను ఆదుకున్న గొప్ప మనసు కెసిఆర్ది అని పేర్కొన్నారు.
KCR protect RTC Employees in Telangana says Sunitha
- Advertisement -