Saturday, May 18, 2024

ఆమెతో డేట్ కి వెళ్లాలనుంది: మురళీ విజయ్

- Advertisement -
- Advertisement -

 

ఆస్ట్రేలియా వుమెన్ క్రికెటర్ ఎల్లిస్ పెర్రీతో కలిసి తాను డేట్ కి వెళ్లాలనుకుంటున్నానని టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్  తన మనసులో మాటను బయటపెట్టాడు. కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ కరోనాపై పెద్ద యుద్ధమే చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించింది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో కొందరు సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో లైవ్ చాట్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. మీరు డిన్నర్ డేట్ కు వెళ్లాలనుకుంటే ఏ ఇద్దరు క్రికెటర్లతో వెళ్తారని అని ఓ అభిమాని అడగగా.. తాను ఆస్ట్రేలియా వుమెన్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తో కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లాలనుకుంటున్నానని సమాధానం ఇచ్చాడు. ఎల్లిస్ పెర్రీ చాలా అందంగా ఉంటుందని, శిఖర్ ధావన్ చాలా ఫన్నీ గాయ్ అని.. అందుకే వీళ్లిద్దరితో డిన్నర్ డేట్ కు వెళ్తానని చెప్పాడు. విరేంద్ర సేహ్వాగ్ తనకిష్టమైన బ్యాటింగ్ పార్ట్ న్నర్ అని, వీరుతో పంచుకున్న డ్రెస్సింగ్ రూమ్ జ్ఞాపకాలను తన జీవితంలో మరిచిపోనని తెలిపాడు.

Murali Vijay Wants to Go on Dinner Date With Ellyse Perry

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News