Friday, April 26, 2024

నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్లపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తమిళనాడుకు చెందిన నక్కలవెల్లి రాజా గత ఆరు నెలల నుంచి చేపల చెరువు వద్ద కాపాలగా ఉంటున్నాడు. అతడి వద్ద నాటు తుపాకీ ఉంది. చెరువు వద్దకు వచ్చిన పక్షులను వేటాడడానికి నాటు తుపాకీ ఉపయోగించేవాడు. తుపాకీ అతడి వద్ద ఉన్న పేలడంతో ఘటనా స్థలంలో అతడు మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తమిళనాడులోని పళని జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

 

One Person dead with Gun miss fire in Krishna dist 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News