Sunday, April 28, 2024

స్వీయ నిర్బంధంలోకి సిఎం

- Advertisement -
- Advertisement -

CM vijay rupani

 

గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అహ్మదాబాద్‌లో సిఎం నిర్వహించిన సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు హాజరయ్యారు. కరోనా సోకిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఇమ్రాన్ ఖేద్వాలా ఈ భేటీలో ఉన్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా సిఎం విజయ్ రూపానీ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వారం రోజుల పాటు సిఎం స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీంతో గుజరాత్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుజరాత్ లో ఇప్పటి వరకు కరోనా రోగుల సంఖ్య 695కు చేరుకోగా 30 మంది మృత్యువాతపడ్డారు.  భారత్ దేశంలో కరోనా వైరస్ 11,575 మందికి సోకగా 398 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకోగా 1,26,811 మంది మృతి చెందారు.

 

Gujarat CM vijay rupani home quarantine with corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News