- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : జమాత్ చీఫ్ సాద్ కంధాల్వీకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చిందని ఆయన న్యాయవాది వెల్లడించారు. కాగా జమాత్ చీఫ్ కరోనా టెస్టుల నివేదికలు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇంకా అందలేదని పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా భారత్ లో కరోనా వ్యాప్తి విదేశాల్లో ఉన్నవారు ఇక్కడి రావడంతో మొదలైందని, ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం అనంతరం మరింత వ్యాపించిందని ఆరోపణలున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధాల్వీపై హత్యానేరం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండు,మూడు రోజుల్లో జమాతే చీఫ్ సాద్ కంధాల్వీని విచారించే అవకాశాలు ఉన్నాయి.
Corona Negative to Tablighi Jamaat Chief
- Advertisement -