Saturday, May 18, 2024

తెలంగాణలో కొత్తగా 15 పాజిటీవ్ కేసులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కొత్తగా మరో 15 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

 

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా మరో 15 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1122కు చేరింది. ఈరోజు నమోదైన 15 కేసుల్లో 12 కేసులు జిహెచ్‌ఎమ్‌సి పరిధిలోనే నమోదయ్యాయని తెలిపింది. ఇందులో ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొంది. కరోనా నుంచి  ఈ రోజు మరో 45 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 693 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 400 మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

15 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News