- Advertisement -
ఇది ఆవకాయ పచ్చడి పెట్టే సమయం. ఒకప్పుడు దాదాపు ప్రతి మధ్యతరగతి వారి ఇంట్లో ఈ సీన్ కనిపించేది. ఇప్పుడు ఆ కల్చర్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. అయితే లాక్డౌన్ పుణ్యమా అని మళ్లీ అందరి ఇళ్లలో ఈ సీన్ కనిపిస్తోంది. మామిడికాయలు తెచ్చుకొని, కట్ చేసుకొని… పచ్చడి పెట్టే పనిని ఇప్పుడు హీరోయిన్లు కూడా చేస్తున్నారు. వరుణ్ సందేశ్ భార్య, హీరోయిన్ వితికా షేరు కూడా ఆవకాయ పచ్చడి పెట్టిందట. ఆమె ఇన్స్టాగ్రామ్లో ఆవకాయ పచ్చడితో తన ఫోటోను కూడా షేర్ చేసింది. మొత్తానికి లాక్డౌన్ వల్ల హీరోయిన్ల కిచెన్ వ్యవహారాలు బయటికి వచ్చాయి. దాదాపుగా ప్రతి హీరోయిన్ ఏదో ఒక వంట చేస్తూ ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు.
- Advertisement -