- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 44 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,671కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 41 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,848 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక, కరోనా వైరస్ బారిన పడి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 767 మంది చికిత్స పొందుతున్నారు.
44 New Corona Positive Cases Reported in AP
- Advertisement -