ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ తయారీదారు కంపెనీ వివో నుంచి 5జీ టెక్నాలజీతో మరో స్మార్ట్ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. తాజాగా వై-సిరీస్లో వై 70ఎస్ స్మార్ట్ఫోన్ను చైనాలో లాంచ్ చేసింది సంస్థ. చైనాలో రిలీజైన ఈ ఫోన్ త్వరలోనే ప్రపంచ మార్కెట్లోకి రానుంది. 5జీ టెక్నాలజీతో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్ 6.53 అంగుళాల డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరాతో పాటు, 128జిబి ఆన్బోర్డ్ స్టోరేజ్తో అందుబాటులో ఉంది. Y70ఎస్.. 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,200గా వినియోగదారులకు లభిస్తోంది. 8GB+128GB వేరియంట్ ధర రూ. 23,300గా కంపెనీ నిర్ణయించింది.
వివో వై70ఎస్ ఫీచర్లు….
6.53 అంగుళాలు డిస్ప్లే, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 48+8+2 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్, 4500 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఒఎస్ వంటి అద్భుత ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి గ్లోబల్ మార్కెట్లోకి రానుంది.