Tuesday, April 30, 2024

కొడుకులతో కలిసి భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

killed

నందిపేట: కట్టుకున్న భర్తను ఇద్దరు కొడుకులతో కలిసి భార్య హత్యచేసిన దారుణ సంఘటన నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట మండలం దుబ్బలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు నిద్రిస్తున్న సమయంలో భార్య తన ఇద్దరు పిల్లలతో భర్త గొంతునులిమి చంపేశారు. మృతుడిని గంధం రమేశ్‌ గా గుర్తించారు. హత్య అనంతరం నిందితులు నందిపేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కుటుంబకలహాలే వల్లే తాము ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Woman killed husband at nizamabad district
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News