Tuesday, May 7, 2024

ప్రాణం తీసిన చున్నీ

- Advertisement -
- Advertisement -

Women dead in Bike accident at YSR

 

అమరావతి: చున్నీ ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా గోపవరం మండలం పెద్దపోటుకుంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుబ్రహ్మణ్యం(30), లక్ష్మీ దేవి(26) అనే దంపతులు కూలీ పనుల కోసం తన ప్రకాశం జిల్లా పామూరు మండలం చీమకుర్తి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. గత పదిహేను రోజుల నుంచి పని దొరక్కపోవడంతో తన సొంతూరుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి వేడి తగలకుండా లక్ష్మీ దేవి చున్నీని కట్టుకుంది. ద్విచక్రవాహనంపై ఊరికి వెళ్తుండగా ఆ చున్నీ బైక్ వెనక చట్రంలో ఇరుక్కోవడంతో కిందపడిపోయింది. తల, ఛాతీకి తీవ్రమైన గాయాలు కావడంతో అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. లక్ష్మీదేవికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News