- Advertisement -
హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి, రంగారెడ్డి పరిధిలో మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పది పరీక్షలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పది పరీక్షలు నిర్వహించాలా? వద్దా అనే దానిపై అధికారులతో ఈ రోజు సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
CM KCR Meeting with Education Officials over 10th Exams
- Advertisement -