- Advertisement -
ఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ కలవరపెడుతోంది. కరోనా వైరస్ ధాటికి ఢిల్లీ విలవిలలాడుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు జ్వరం, గొంతు నొప్పి ఉండడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లిపోయారు. కేజ్రీవాల్ మంగళవారం కరోనా టెస్టులు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్యలో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో దాదాపుగా 29 వేల కరోనా కేసులుండగా ఎనిమిది వందల మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో కరోనా వైరస్ 2.57 లక్షల మందికి వ్యాపించగా 7208 మంది చనిపోయారు. కరోనా నుంచి 1.24 లక్షల మంది కోలుకోగా 1.25 లక్షల మంది వివిధ ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్యలో భారత్ ఆరో స్థానానికి చేరుకుంది.
- Advertisement -