- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. నందీహిల్స్ కాలనీ రోడ్ నెం.19లో ఉన్న 20 ఫీట్ రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ చేయడానికి తీసిన పిల్లర్ గుంతలో పడి 3 సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. నిన్న కురిసిన వర్షానికి పిల్లర్ గుంత నీటితో నిండి పోయింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు ఆ గుంతలో పడి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చిన్నారి స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూర్గా గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- Advertisement -