- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. బుధవారం ఉదయం నుంచి మేయర్ డ్రైవర్ డ్యూటీలో ఉన్నాడు. దీంతో మరోసారి బొంతు రామ్మోహన్ కు వైద్యులు కరోనా పరీక్షలు చేయనున్నారు. తీవ్రమైన దగ్గుతో పాటు గొంతు నొప్పి ఉండడంతో డ్రైవర్ కు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. రెండు రోజుల క్రితం బొంతు రామ్మోహన్ కు కరోనా పరీక్షలు చేస్తే నెగటివ్ వచ్చిన విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్ లో ఎక్కడ చూసిన కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎల్బీ నగర్ ప్రాంతం సాగర్ రింగ్ రోడ్డు లో ఆలేఖ్య టవర్స్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆలేఖ్య టవర్స్ లో 11 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ రెడ్ జోన్ గా ప్రకటించారు.
- Advertisement -