- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మోడీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం పెట్టిన పోస్ట్లో ‘నరేంద్రమోడీ వాస్తవానికి సరెండర్(లొంగిపోయే) మోడీ’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత భూభాగాన్ని చైనాకు స్వాధీనం చేశారంటూ ప్రధానిని విమర్శించిన మరుసటి రోజే రాహుల్ మరోసారి
విరుచుకుపడ్డారు. గాల్వన్ లోయలో 20మంది భారత సైనికులు మరణించడానికి ప్రభుత్వ ఉదాసీనతే కారణమంటూ రాహుల్తోపాటు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం అఖిలపక్షం భేటీలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కాగా, మోడీ వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ ప్రధాని కార్యాలయం(పిఎంఒ) ఇప్పటికే వివరణ ఇచ్చింది.
- Advertisement -