- Advertisement -
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భూకంపం సంభవించింది. తూర్పు జమ్మూకాశ్మీర్లోని కత్రా జిల్లాకు 103 కిలోమీటర్ల దూరంలో మంగళవారం రాత్రి 11.32 గంటలకు భూమి కపించినట్లు భూ పరిశోధన అధికారులు తెలిపారు. ఐదు కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని, రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.6గా నమోదైందని పేర్కొన్నారు. దీంతో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, లాహోర్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీనివల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం ఉదయం కూడా తూర్పు కత్రాలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కూల్పై 4.0గా నమోదైంది.
Magnitude 4.6 Earthquake in Jammu Kashmir
- Advertisement -