- Advertisement -
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో 1088 కొత్త అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యాధునిక సౌకర్యాలతో సేవలందించేందుకు రూపొందించిన 108, 104 అంబులెన్స్లను బుధవారం సిఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు నుంచే రాష్ట్రంలో 108 అంబులెన్స్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రానికి ఒక వాహనం నడపనున్నారు. ప్రత్యేకంగా చిన్నారుల కోసం కొన్ని అంబులెన్స్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం రూ.201కోట్లతో 1088 కొత్త వాహనాలను ఎపి ప్రభుత్వం కొనుగోలు చేసింది.
CM Jagan begins New 108, 104 Ambulances
- Advertisement -