Monday, May 20, 2024

బెంగళూరులో దారుణం.. అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డుపైనే కుప్పకూలిన కరోనా పేషెంట్..

- Advertisement -
- Advertisement -

బెంగళూరుః కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో జిల్లాలో కరోనా మృతదేహాలను ఈడ్చుకొచ్చి విసిరిపారేసిన ఘటన మరవకముందే మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా ఎంతకూ రాకపోవడంతో ఓ కరోనా బాధితుడు రోడ్డుమీదనే కుప్పకూలి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన దక్షిణ బెంగళూరులోని హనుమాన్ నగర్‌లో జరిగింది. కరోనా బారిన పడిన 44 ఏళ్ల ఓ వ్యక్తి హోంఐసోలేషన్‌లో ఉంటున్నాడు. అయితే, శ్వాస తీసుకోవడానికి బాధితుడు ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రోడ్డుపైకి వచ్చి చాలాసేపు ఎదురుచూసిన అంబులెన్స్  రాలేదు. దీంతో బాధితుడి పరిస్థితి విషమించి రోడ్డుమీదనే కుప్పకూలి చనిపోయాడు. దీంతో మరోసారి అంబులెన్స్‌కు ఫోన్ చేసినా స్పందించలేదు. కరోనాతో మృతి చెందడంతో చుట్టుప్రక్కలవారు కూడా ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేకపోయారు. దీంతో నాలుగు గంటలపాటు మృతదేహం అలానే రోడ్డుమీదే ఉన్నది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bengalur: Corona patient dies on road wait for ambulance

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News