Saturday, April 27, 2024

దేశంలో ఒక్కరోజే 23వేల కేసులు.. 442మంది మృతి

- Advertisement -
- Advertisement -

22771 New Corona Cases Reported in AP

న్యూఢిల్లీః భారత్‌లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశంలో ప్రతిరోజూ ఏకంగా 20వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,771 కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 442 మంది మృతిచెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడిచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,48,315కు చేరుకుంది.ఇక, కరోనా బారిన పడి ఇప్పటివరకు 18,655మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,35,433 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,94,227 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 60.81 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

22771 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News