- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,764 కొత్త కోవిడ్-19 కేసులు, 12 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో 58,906 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 492మంది ఈ వైరస్ తో చనిపోయారు. హైదరాబాద్ లో 509, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 158, రంగారెడ్డి 147 కరోనా కేసులు నమోదదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 43,751 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,858 కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 3,97,939మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.
- Advertisement -