Monday, April 29, 2024

24 గంటల్లో 48,513 కొత్త కేసులు.. 768 మంది మృతి

- Advertisement -
- Advertisement -

48513 new Covid 19 cases and 768 deaths in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 48,513 కొత్త కోవిడ్-19 కేసులు, 768 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15 లక్షల 31 వేల 669కి చేరింది. భారత్ లో ఇప్పటివరకు మొత్తం 34,193 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 5 లక్షల 50,447 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు  9లక్షల 88,029 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా దేశంలో 1.77 కోట్ల కోవిడ్ టెస్టులు చేయగా.. గత 24 గంటల్లో 4.08 లక్షల కరోనా పరీక్షలు చేసినట్టు ఐసిఎమ్ఆర్ తెలిపింది. ఇండియాలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి.

48513 new Covid 19 cases and 768 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News