- Advertisement -
నాగర్ కర్నూల్: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి ఇల్లు కూలి తల్లీకుమారై మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా రాకొండలో ఆదివారం చోటుచేసుకుంది. మృతులను తల్లి కోటమ్మ, కుమారై బొజ్జమ్మగా అధికారులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ట్రాక్టర్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలు ట్రాక్టర్ లో గంట నుంచి వర్షంలో తడుస్తున్న ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
mother and daughter died in collapsed house
- Advertisement -