- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీమవరం నుంచి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తణుకు వెళ్తుండగా కారు అదుపుతప్పి కాలువలో బోల్తాపడడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వెంటనే వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కారులో నుంచి మూడు మృతదేహాలు బయటకు తీశారు. మృతులు ఆర్టీఒ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, వెలుగు డిపార్ట్ మెంట్ ఉద్యోగిని సుభాషిణి, మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగి జీవన్ శేఖర్ గా గుర్తించారు.
- Advertisement -