- Advertisement -
లండన్: కరోనా నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వెయ్యి నుంచి పదివేల పౌండ్ల (దాదాపు రూ.10 లక్షల) వరకు జరిమానా విధిస్తామని ఇంగ్లాండ్ హెచ్చరించింది. పాజిటివ్ వచ్చిన వారితోపాటు వైరస్ లక్షణాలున్న వారు కచ్చితంగా పది నుంచి 14 రోజుల పాటు ఐసొలేషన్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. ఈనెల 28 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు లోకి వస్తాయి. బ్రిటన్లో రెండో దఫా వైరస్ విజృంభిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వెల్లడించారు. దీంతో ఇంగ్లాండ్లో చాలా ప్రదేశాల్లో కఠిన నిబంధనలు విధించారు. వివిధ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఆరుగురు కంటే ఎక్కువ మంది ఒకచోట ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు.
Rs 10 lakh fine for breaking Corona rules in England
- Advertisement -