Tuesday, April 30, 2024

ఈ దాడి హేయమైన చర్య: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao comments on BJP attack

సిద్దిపేట: ఎంఎల్‌ఎ క్రాంతికిరణ్, మాజీ ఎంఎల్‌ఎ వేముల వీరేశంపై బిజెపి కార్యకర్తలు దాడి హేయమైన చర్య అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పథకం ప్రకారమే బిజెపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, వాళ్లు ఉంటున్న లాడ్జ్‌కి వెళ్లి వారిపై బౌతికదాడులకు పాల్పడటం సరికాదని, వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బిజెపి నాయకులు నిన్న మొన్న కొన్ని దుర్మార్గ ప్రణాళికలు రచించారని, ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగమే సిద్దిపేటలో జరిగిన పెద్ద కుట్ర అని, బిజెపి నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దాడికి 15 నిమిషాల ముందే పోలీసులు వచ్చి తనిఖీలు చేసి వెళ్లారని, పోలీసుల తనిఖీ సందర్భంగా ఎలాంటి ప్రచార సామాగ్రి లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News