Friday, April 26, 2024

భార్యను చంపి… శవాన్ని స్కూటీపై పెట్టుకొని వెళ్తుండగా…

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: భార్యను చంపి అనంతరం ఆమె శవాన్ని స్కూటీపై భర్త తీసుకెళ్లిన సంఘటన గుజరాత్‌లో జరిగింది. వెరవల్ గ్రామంలో హేమనానికి నైనాతో గత సంవత్సరం పెళ్లి జరిగింది. ఎల్‌పిజి డిస్ట్రిబ్యూషన్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దంపతుల మధ్య గొడవ రావడంతో నైనా గొంతు నులిమి చంపేశాడు. శవాన్ని మాయ చేసేందుకు స్కూటీ మీద భార్య శవాన్ని పెట్టుకొని భర్త వెళ్తుండగా గ్రామస్థులు పట్టుకొని అతడిని పోలీసులకు అప్పగించారు. రోహిశాల గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో తన భార్య శవాన్ని పడేయడానికి వెళ్తున్నానని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఎందుకు చంపాడో అసలు విషయం తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News