కాన్బెర్రా : విరాట్ కోహ్లీ కెరీర్లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్గా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం 251 వన్డేల్లో విరాట్ ఈ ఘనతను కైవసం చేసుకున్నాడు. 242వ ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 59.41గా ఉంది. కోహ్లీ వన్డే ఖాతాలో 43 సెంచరీలు ఉన్నాయి. పరిమితి ఓవర్ల క్రికెట్లో తనకు సాటి లేదన్న రీతిలో కోహ్లీ తన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. కోహ్లీ 242, సచిన్ 300, పాంటింగ్ 314, సంగక్కర 336, జయసూర్య 379వ ఇన్నింగ్స్లో 12 వేల పరుగుల మైలురాయిని దాటారు. కోహ్లీ దూకుడుకు సచిన్ రికార్డులు ఒక్కొక్కటి కనుమరుగవుతున్నాయి. సచిన్ 300 ఇన్నింగ్స్లో 12 వేల పరుగుల్ని చేయగా.. కోహ్లీ మాత్రం 242 ఇన్నింగ్స్లోనే ఆ ఘనతను సాధించాడు.