Saturday, May 18, 2024

ఆత్మవిశ్వాసం పెరిగింది: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను ట్వంటీ20లలో ఓడించడం తమకు పెద్ద ఊరటనిచ్చే అంశమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. వన్డేల్లో ఓడినా టి20ను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. సిరీస్ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. రానున్న టెస్టు సిరీస్‌లో సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా ఉందన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోల్చితే టెస్టు క్రికెట్ పూర్తిగా భిన్నమైందన్నాడు. ఇందులో చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించడం ఏ జట్టుకైన చాలా క్లిష్టమైన అంశమన్నాడు. అయితే తాము మాత్రం గెలుపే లక్షంగా సిరీస్‌కు సిద్ధమయ్యామన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు బలంగా ఉందన్నాడు. రహానె, పుజారా, అశ్విన్‌లు టెస్టుల్లో తమ ప్రధాన అస్త్రాలన్నాడు. ఇక సిరాజ్, ఉమేశ్ యాదవ్, బుమ్రాలతో ఫాస్ట్ బౌలింగ్ చాలా బలంగా ఉన్నాడు. అశ్విన్ రూపంలో తమకు మ్యాచ్ విన్నర్ ఉన్న విషయాన్ని కోహ్లి గుర్తు చేశాడు. ఇక ఫాస్ట్ పిచ్‌లపై రహానె, పుజారాలకు మంచి రికార్డు ఉందన్నాడు. ఇది కూడా తమకు కలిసి వచ్చే అంశమేనని కోహ్లి అభిప్రాయపడ్డాడు.

I’m Proud that Won T20 Series against Australia: Kohli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News