- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై విపక్ష నేతల బృందం కాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనుంది. రాష్ట్రపతిని ఐదుగురు నేతలకు కలవనున్నారు. రాహుల్ గాంధీ, శరద్ పవార్, డి.రాజా, సీతారం ఏచూరి, డిఎంకే ప్రతినిధి రాష్ట్రపతిని కలవనున్నట్టు సమాచారం. నూతన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలను నేతలు రాష్ట్రపతికి వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రతిపదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతులు కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కొత్త చట్టాలను రద్దు చేసేంతవరకు వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Five Opposition leaders will meet President Kovind
- Advertisement -