Monday, April 29, 2024

సెంట్రల్ విస్టా భారత చిహ్ననికి ప్రతీక

- Advertisement -
- Advertisement -

CM KCR Congratulate Prime Minister Narendra Modi

జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం పూర్తి అవ్వాలి
ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సిఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని సిఎం పేర్కొన్నారు. “సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి” అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

CM KCR Congratulate Prime Minister Narendra Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News