- Advertisement -
ఖమ్మం జిల్లాలో దారుణ సంఘట చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్లతోపాటు తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన గోవిందమ్మ పెద్ద కూతురు రాధికకు పెళ్లి కుదరింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి వరుడి కుటుంబం అంగీకరించింది. దీంతో జనవరి 11న వీరి వివాహం జరిపించాలని నిర్ణయించారు. అయితే, పెళ్లిచేసేందుకు కూడా డబ్బులేకపోవడంతో మనస్థాపానికి గురై ఇద్దరు కూతుళ్లతోపాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Mother and 2 Daughters Suicide in Khammam
- Advertisement -