Wednesday, May 8, 2024

తెలంగాణలో కొత్తగా 643 పాజిటీవ్ కేసులు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

643 New Coron Cases Registered in Telangana

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24గంటల్లో 53,396 టెస్టులు చేయగా.. కొత్తగా 643 కరోనా‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వైరస్ తో మరో ఇద్దరు బాధితులు మరణించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,75,904కు చేరుకుంది. ఇక, కరోనా బారిన పడి మొత్తం 1482 మంది ప్రాణాలు కోల్పోయారు.గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 805 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 2,66,925 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 7,497 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా.. మరో 5,434 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 59,73,031 కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

643 New Coron Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News